2025 IPL లో భాగంగా ఇంగ్లండ్ ప్లేయర్ బ్రైడన్ కార్సే ఇటీవల గాయపడ్డాడు. ఈ ప్లేయర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కార్సే బొటనవేలికి గాయమైంది. ఫలితంగా అతడు ఈ వన్డే టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక ఐపీఎల్ నాటికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి లేకపోవడంతో 18వ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్లు సన్రైజర్స్ ప్రకటించింది. అతడి స్థానంలో వియాన్ ముల్దర్ను రూ. 75 లక్షలకు జట్టులోకి తీసుకుంది. త్వరలోనే ఈ ఆల్రౌండర్ సన్రైజర్స్తో చేరనున్నాడు.
మల్డర్ ఇప్పటి వరకు 11 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లతో పాటు 18 టెస్టులు, 25 వన్డేల్లో సౌత్ ఆఫ్రికా తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటి వరకు 60 వికెట్లు తీయడంతో పాటు 970 పరుగులు సాధించాడు. మల్డర్ ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు:
హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా., సిమర్జీత్ సింగ్, ఇషాన్ మలింగ, వియాన్ ముల్దర్, జయదేవ్ ఉనాద్కట్, కమిందు మెండిస్, జీషాన్ అన్సారీ, అనికేత్ వర్మ, అథర్వ టైడే.
#PlayWithFire pic.twitter.com/we4AfNuExc
— SunRisers Hyderabad (@SunRisers) March 6, 2025
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa