వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలుతోపాటు ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి ఈ వ్యవహారంలో 700కోట్లు దోచేశారని, విజిలెన్సు చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కోరారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఈ దోపిడీ జరిగిందని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వ్యాఖ్యానించగా మెజారిటీ ఎమ్మెల్యేలు అవునంటూ సమర్థించారు. నరసరరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ భూమి ఆక్రమించి ప్లాట్లుగా విక్రయించి కోట్లు దోచేశారని, చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కోరారు.
తిరుపతిలో రూ.800కోట్ల ఒంటేరు చెరువు స్థలాన్ని కబ్జాచేసేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. పంచాయతీల పరిధిలోని తాగునీటి ప్లాంట్ల మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి జీరో అవర్లో సభ దృష్టికి తీసుకొచ్చారు. గోదావరిలోకి రాజమహేంద్రవరంలోని డ్రైనేజీ నీరు చేసి పొలాలు కలుషితమవుతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలంటూ పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర విన్నవించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa