ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధాన రోడ్లను హైవేలకు కనెక్ట్ చేసే పనిలో ఉంది. కృష్ణా జిల్లాలో కీలకమైన మచిలీపట్నం పోర్టు, గుడివాడ రోడ్లను నేషనల్ హైవేలకు అనుసంధానం చేస్తోంది. ఈ రోడ్ల కోసం రూ.610 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మచిలీపట్నం పోర్ట్ను నేషనల్ హైవేకు కనెక్ట్ చేసే అంశంపై మోర్త్ అధికారులతో విజయవాడలో ఎంపీ బాలశౌరి చర్చించారు. ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.
మచిలీపట్నం పోర్ట్ నుంచి మాచవరం రైస్ మిల్ సెంటర్ వరకు 3.7 కిలో మీటర్ల రోడ్డు నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డుగా..
మాచవరం రైస్ మిల్లు కూడలి నుంచి ఎన్హెచ్ 65 దగ్గర రోడ్డు వరకు రెండు వరుసల 4 కిలో మీటర్ల రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించేందుకు చర్యలు తీసుకోండి' అని ఎంపీ కోరారు. ఈ మచిలీపట్నం పోర్ట్ను కనెక్ట్ చేసే రోడ్డుకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేశామని అధికారులు ఎంపీకి తెలిపారు. ఈ రోడ్డు మొత్తం 12.6 కిలోమీటర్లకు గాను రూ.583 కోట్లు వ్యవయం అవుతుందని అంచనా వేయగా.. ఆర్వోబీ, ఫ్లై ఓవర్, అండర్పాస్, ఆరుచోట్ల ఇన్నర్ రోడ్ల నిర్మాణాలు కూడా ఉండేలా ప్లాన్ చేశారు.
మచిలీపట్నం పోర్ట్ రోడ్డు కనెక్టివిటీతో పాటుగా గుడివాడలో ప్రయాణికుల రద్దీకి తగిన విధంగా.. పట్టణంలో 2.80 కిలో మీటీర్ల రోడ్డును రూ.18కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు అధికారులు. 216హెచ్ హైవేతో నాలుగు లైన్ల రోడ్లతో అనుసంధానం చేయాలని ఎంపీ అధికారులకు సూచించారు. నేషనల్ హైవే 165 నుంచి 216హెచ్ వరకు 3 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు రూ.9కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. నాగవరప్పాడు బ్రిడ్జి నుంచి వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కాలేజీల వరకు ఫుట్పాత్, డ్రెయిన్లు, లైటింగ్, డివైడర్ల నిర్మాణాలకు డీపీఆర్ తయారు చేస్తామన్నారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే.. తాను నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు ఎంపీ బాలశౌరి. మొత్తం మీద మచిలీపట్నం పోర్ట్, గుడివాడకు సంబంధించి రోడ్లపై ఎంపీ బాలశౌరి ఫోకస్ పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa