సమాన హక్కులు, అవకాశాలు, అధికారాల కోసం మహిళలంతా గొంతెత్తి ప్రశ్నిస్తున్న రోజుల్లో ఏపీలో భద్రత కోసం మహిళలు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. సగర్వంగా తలెత్తుకుని ఆనందంగా జీవించడమే కాకుండా నవరత్నాల ద్వారా 90 శాతం పథకాల లబ్ధిదారులు మహిళలే ఉన్నారని తెలిపారు. శ్యామల మాట్లాడుతూ.... మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు పడిన ఆ రోజుల్లో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.75 లక్షల కోట్లు ప్రజలకు అందజేస్తే దానిలో మూడొంతులు మహిళలే లబ్ధిదారులు. వైయస్ జగన్ సీఎంగా దార్శనికతో వేసిన అడుగులు ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపాయి. దిశ యాప్ ద్వారా మహిళల రక్షణకు అన్నగా నిలబడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధితుల పక్షాన ప్రభుత్వం తరఫున భరోసా ఇచ్చారు. ఇలాంటి గొప్ప యాప్ను కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వీర్యం చేసింది. దిశ ప్రతులను తగలబెట్టి మహిళల రక్షణ పట్ల తమకు బాధ్యత లేదన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పకనే చెప్పారు. కాబట్టే ఈ 9 నెలల్లో మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా నిందితులను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ స్వయంగా అంగీకరించారు. గతేడాది జూన్ నుంచి జనవరి వరకు రాష్ట్రంలో 16,809 కేసులు నమోదైనట్లు హోంమంత్రి అనిత శాసనసభ సాక్షిగా సమాధానం ఇచ్చారు. కానీ ఒక్క కేసులోనైనా నిందితులను శిక్షించి బాధితులకు న్యాయం చేశామని చెప్పలేకపోతున్నారు అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa