మహిళల భద్రత, మహిళాభ్యుదయం కేంద్రంగా వైయస్ జగన్ పరిపాలన కొనసాగిందని వైసీపీ మహిళా నేతలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ.... కుటుంబ బాధ్యతలు మోస్తున్న వారికి ఊరటనిచ్చేలా నాడు జగన్ ప్రభుత్వం అండగా నిలబడితే, ఆ భరోసాను ఇప్పుడు లేకుండా చేశారు. దారుణంగా వారిని మోసం చేశారు. ఇవాళ మహిళల్ని మోసం చేసేలా, వాళ్లను అభద్రతకు గురి చేసేలా పరిపాలన సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణాలు జరిగినా పట్టించుకోవడంలేదు. గత ప్రభుత్వ పరిపాలనలో ఏ చిన్న దుస్సంఘటన జరిగినా స్పందించడానికి దిశ వంటి వ్యవస్థ ఉండేది. వేగంగా మహిళలకు సహాయం అందేది. నేడు రాష్ట్రంలో మహిళల రక్షణను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. మహిళలకు భద్రత కరువైంది. వారికి భరోసా లేకుండా పోయింది. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ విషయంలో వారి వైఫల్యాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో స్వయంగా ఒప్పుకున్నారు. గత ఏడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో (కూటమి పాలనలో) మహిళలపై నేరాలకు సంబంధించి 16,809 కేసులు నమోదైనట్లు శాసనసభలో హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ లెక్కన రాష్ట్రంలో గంటకు సగటున మూడు అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే కూటమి పాలనలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa