ఈ నెల 12 న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, అదే రోజు వైయస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే స్పందించాలని, ఆయా వర్గాల తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన యువత పోరు కార్యక్రమ ర్యాలీలు, జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa