ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ ఘటన ఏపీ లోని కడప జిల్లా మైదకూరులో గల ఓ ప్రైవేటు కాలేజీలో నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..సుజనకుమారి అనే విద్యార్థిని శనివారం ఇంటర్ పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా...పరీక్ష రాసి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళిన సుజనకుమారి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో సుజనకుమారి ఇంటి పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa