ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్మిక మందనకు భద్రత కల్పించండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి

national |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 10:35 PM

పాన్ ఇండియా హీరోయిన్‌ రష్మిక మందన వివాదం కన్నడ నాట తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల కర్ణాటకలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక మందన రాకపోవడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో రష్మిక మందనకు భద్రతా పరమైన ముప్పు ఉందని.. ఆమె వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక మందనకు చెందిన కొడవ వర్గానికి చెందిన నేతలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. రష్మిక మందనకు ముప్పు ఉందని.. అందుకే ఆమెకు భద్రతను కేటాయించాలని ఆ లేఖలో కొడవ వర్గం నేతలు విజ్ఞప్తి చేశారు.


ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్‌కు రావాలని నిర్వాహకులు రావాలని రష్మిక మందనకు ఆహ్వానం అందించారు. అయితే పలు కారణాల వల్ల ఆమె ఆ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కాకపోవడం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవికుమార్.. రష్మిక మందనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి సినిమా కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన.. తన మూలాలు మర్చిపోతోందని ఆరోపించారు. అందుకే రష్మిక మందనకు కర్ణాటక ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెప్పి తీరాలని ఎమ్మెల్యే రవికుమార్ పిలుపునిచ్చినట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.


దీంతో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో ఆయన తర్వాత వివరణ కూడా ఇచ్చారు. రష్మిక మందనకు గుణపాఠం చెప్పాలంటే.. ఆమెపై దాడి చేయాలని అర్థం కాదని క్లారిటీ ఇచ్చారు. రష్మిక మందనకు లైఫ్ ఇచ్చిన ప్రాంతానికి కూడా ఆమె ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు. రష్మిక అంటే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని తెలిపిన ఎమ్మెల్యే రవికుమార్.. ఆమె నటన అంటే తనకు కూడా చాలా ఇష్టమని పేర్కొన్నారు. అయితే ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా.. మూలాలు మర్చిపోకూడదని సూచించారు.


అయితే ఎమ్మెల్యే రవికుమార్ తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చినా.. ఈ వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. దీంతో రష్మికకు ప్రమాదం పొంచి ఉందని.. ఆమెకు ప్రభుత్వాలు భద్రత కల్పించాలని కొడవ సామాజికవర్గం నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు రష్మిక మందన స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు.. వరుస హిట్లతో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన మంచి జోష్ కొనసాగిస్తోంది. పుష్ప, పుష్ప-2 సినిమాలతో గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న రష్మిక.. ఇటీవల ఛావా సినిమాతో మరో భారీ సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం రష్మిక 4, 5 సినిమాల్లో నటిస్తుండగా.. అందులో ఒకట్రెండు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa