ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిరిండియా విమానంలో మరో సమస్య.. 10 గంటలు గాల్లో తిరిగి రిటర్న్

international |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 11:26 PM

ఈమధ్య కాలంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. విరిగిన కుర్చీలు, సిబ్బంది నిర్లక్ష్యంతో అనేక మంది అవస్థలు పడగా.. వారు తమ బాధను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇలా తరచుగా ఎవరో ఒకరు ఆ విమానాల్లో ఇబ్బంది పడగా.. తాజాగా 300 మందికి పైగా ప్రయాణికులు నరకం చూశారు. విమానం గాల్లో ఉండగానే అక్కడి సిబ్బందితో గొడవ పడగా.. ఆ విమానాన్ని తిరిగి అత్యవసరంగా రిటర్న్ తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా 10 గంటలు గాల్లో తిరిగిన విమానం తిరిగి ఎక్కడి నుంచి బయలు దేరిందో అక్కడకే చేరుకుంది. అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐI126 విమానం మార్చి 6వ తేదీన చికాగో నుంచి ఢిల్లీకి బయలు దేరింది. ముఖ్యంగా ఈ విమానంలో 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అయితే వీరంతా విమానం ఎక్కగా.. హాయిగా ప్రయాణం ప్రారంభం అయింది. కానీ గాల్లో ఎగురుతున్నప్పుడు పలువురు ప్రయాణికులు టాయిలెట్ల కోసం బాత్రూంలలోకి వెళ్లబోయారు. కానీ ఏ ఒక్క తలుపూ తెరుచుకోలేదు. దీంతో సదరు ప్రయాణికులు సిబ్బందిని అడిగారు. దీంతో సిబ్బంది సైతం టాయిలెట్లను పరీక్షించింది.


మొత్తంగా ఆ విమానంలో 12 టాయిలెట్లు ఉన్నాయి. అందులో పెండు ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం కాగా.. మిగతా 10 అందురూ వాడుకోవచ్చు. కానీ వీటిల్లో ఒకే ఒక్క టాయిలెట్ మాత్రమే పని చేసింది. మిగతా వన్నీ పలు సాంకేతిక సమస్యల కారణంగా వాటి తలుపులు తెరుచుకోలేదు. దీంతో అనేక మంది ప్రయాణికులు బాత్రూం వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. దీంతో వారంతా సిబ్బందితో గొడవకు దిగారు. ఒక్కదాన్ని ఎలా, ఎంత మందిమి వినియోగించుకోగల్గుతామంటూ వాగ్వాదం చేశారు.


ఇక చేసేదేమీ లేక సిబ్బంది ఆ విమానాన్ని అత్యసవరంగా వెనక్కి మళ్లించింది. దాదాపు 100 గంటల పాటు గాల్లో తిరిగి.. ఎక్కడి నుంచి బయలు దేరిందో అక్కడకే చేరుకుంది. ముఖ్యంగా చికాగో చేరుకున్న వెంటనే సదరు ప్రయాణికులు అందరికీ వసతులు కల్పించారు. వారంతా టాయిలెట్లు వాడుకునేలా ప్రత్యేక గదులను ఇచ్చారు. ఆపై వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.


సిబ్బంది నిర్లక్ష్యం, సాంకేతిక సమస్యల వల్ల తాము అనేక ఇబ్బందులు పడ్డామని.. దాదాపు 10 గంటలకు పైగా బాత్రూం వెళ్లలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విమానంలో ఉండగా గొడవ చేస్తున్నప్పుడు ఓ ప్రయాణికుడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా ఎయిర్ ఇండియా విమానాలు అంటేనే సమస్యల వలయం అని, ప్రతీ ఒక్క ప్రయాణికుడు ఈ సర్వీస్ వల్ల ఏదో ఒక సమస్య ఎదుర్కునే ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com