ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును మరోసారి మండలి పదవి వరించింది. అనూహ్యంగా ఆయన పేరును అధిష్ఠానం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బీ ఫాం పంపింది. దీంతో టీడీపీ కూటమి నేతలతో కలిసి వీర్రాజు నామినేషన్ వేశారు. గతంలో 2014లో కూడా టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయనకు తొలిసారి మండలి సభ్యత్వం దక్కింది. పదవీ కాలం ముగిశాక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన వీర్రాజు.. 2024 ఎన్నికల్లో రాజమహేంద్రవరం అర్బన్ లేదా రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ప్రయత్నించారు. అయితే సిటింగ్ స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వలేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేయడంతో ఆయన ఆశలు ఫలించలేదు. తాజాగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడంతో తమ పార్టీకీ ఒక సీటు కేటాయించాలని బీజేపీ పెద్దలు కోరారు. ఆయన సమ్మతించడంతో వీర్రాజును ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa