సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్ట్ అయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని కడప జైలు నుంచి రిమ్స్కు తరలించారు. అనారోగ్య కారణాల వల్ల చికిత్స కోసం వర్రాను జైలు అధికారులు రిమ్స్కు తరలించారు. రిమ్స్లో చికిత్స అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు వర్రా రవీందర్ రెడ్డి కోసం ఎన్టీఆర్ జిల్లా చిల్లేకళ్ళు పోలీసులు కడప సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. గతంలో వర్రాపై చిల్లేకళ్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో పీటీ వారెంట్తో చిల్లేకళ్లు పోలీసులు.. కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. ప్రస్తుతం వర్రా కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.అయితే.. మొదట చిల్లేకళ్లు పోలీసులు రిమ్స్కు వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల వర్రాను రిమ్స్కు తీసుకువచ్చామని.. ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు వీలులేదని.. రిమ్స్ను నుంచి కడప జైలుకు తరలించాక.. అక్కడ ప్రాసెస్ పూర్తి చేశాక వర్రాను తీసుకెళ్లాలని కడప పోలీసులు స్పష్టం చేశారు. చికిత్స అనంతరం వర్రాను తిరిగి కడప సెంట్రల్కు తరలించారు పోలీసులు. దీంతో కడప జైలు సూరింటెండెంట్కు పీటీ వారెంట్ను ఇచ్చిన అనంతరం అక్కడి నుంచి వర్రాను చిల్లేకళ్లుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa