కర్ణాటక అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ పై జరిపిన చర్చ చర్చనీయాంశంగా మారింది. అక్కడ అమలు చేస్తున్న 5 గ్యారంటీల అమలుకు ఏర్పాటు చేసిన సమితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించటంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. జగన్ CMగా ఉన్నపుడు పథకాల అమలుకు వాలంటీర్లను నియమించి ప్రభుత్వ ధనాన్ని వృథా చేసిన విషయం దృష్టిలో పెట్టుకోవాలని ప్రతిపక్షాలు హితవు పలికాయి. ప్రభుత్వ సొమ్మును కార్యకర్తల జేబులు నింపడానికి వాడుతున్నారంటూ BJP ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa