ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర అప్పులపై ఇన్ని అబద్ధాలా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 09:34 AM

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవి పచ్చి అబద్దాలేననే విషయం బట్టబయలు అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతి కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ప్రపంచబ్యాంక్ ద్వారా ఇప్పిస్తోందని, ఇది పూర్తి గ్రాంట్ అంటూ ఇప్పటి వరకు చేసిన వాదనలు పూర్తి అవాస్తవాలేనని తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన అంశాలతో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు చేస్తున్న బుకాయింపులన్నీ అసత్యాలేనని బయటపడిందన్నారు. ఆయన మాట్లాడుతూ..... అమ‌రావ‌తి నిర్మాణానికి ప్ర‌పంచ బ్యాంకు ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పించేది గ్రాంట్ మాత్రమేనని, దీనిని అప్పుగా తిరిగే కట్టాల్సిన అవసరం లేదంటూ ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది.


తాజాగా పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి దీనిపై ఇచ్చిన స్పష్టతతో ఇదంతా అబ‌ద్ధ‌మేన‌ని తేలిపోయింది. వైయ‌స్సార్సీపీ ఎంపీ గురుమూర్తి  ఈనెల 10వ తేదీన పార్ల‌మెంట్‌లో అడిగిన క్వ‌శ్చ‌న్ నెంబ‌ర్ 1703కు కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి పార్లమెంట్‌లో లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు.  ప్ర‌పంచ‌బ్యాంకు, ఏడీబీ స‌హా ఇత‌ర రుణాలన్నీ రాష్ట్ర ప్ర‌భుత్వం చేసే అప్పుల ప‌రిధిలోకి రాని రుణాలే అయినప్పటికీ రాష్ట్ర ప్ర‌భుత్వమే వాటిని చెల్లించాల‌ని కేంద్ర మంత్రి తన సమాధానంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రం కేవలం ప‌ది శాతం మాత్ర‌మే అంటే రూ. 1500 కోట్లు వ‌ర‌కే గ్రాంట్‌గా ఇస్తుందని వెల్లడించారు. అమ‌రావ‌తికి కేంద్ర సాయం ఒట్టిదేన‌ని, చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఇన్నాళ్లు వైయ‌స్సార్సీపీ చెబుతూ వ‌స్తున్న‌దే ఇప్పుడు నిజ‌మైంది. కేంద్ర మంత్రి ఇచ్చిన స‌మాధానం ద్వారా చంద్ర‌బాబు చేసిన ప్ర‌చారం అబద్ధ‌మేన‌ని తేలిపోయింది అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa