ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటిలో చోరీకి పాల్పడిన దొంగలు, 9 సవర్ల బంగారం మాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 11:06 AM

పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం గోళ్లపాడులో చోరీ జరగింది. ఇంటి తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 9 సవర్ల బంగారం, కిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. బాధితురాలు నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అలానే పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం, దీపాలదిన్నేపాలెంలో భర్త గంగరామ్ ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య , మామ, బావమరిదిలపై గొడ్డలితో దాడి చేశాడు. కుటుంబ కలహల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మామ గంగయ్య(55) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa