ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పట్టాదారు పాసు పుస్తకము సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 11:02 AM

ఆంధ్రప్రదేశ్ శాసన సభ  11వ రోజు బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అలాగే శాసన మండలి  పదవ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఆయా శాఖల బడ్జెట్ పద్దులపై ఉభయ సభల్లో చర్చ జరిగి ఆమోదం పొందనున్నాయి. 2024 ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల పట్టాదారు పాసు పుస్తకము సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. శాసన సభలో టిడ్కో ఇళ్ళ లబ్దిదారుల మార్పు... రాష్ట్రంలో వలసలు... బిల్లుల చెల్లింపులో అక్రమాలు .. ఆంధ్ర విశ్వ విద్యాలయాలయంలో అక్రమాలు.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అలాగే ఇంధన రంగంపై శాసన సభలో లఘు చర్చ జరగనుంది. శాసన మండలిలో సామాజిక భద్రత ఫించన్లు.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు.. పర్మిట్ రూములకు అనుమతి .. పీడీఎఫ్ బియ్యం అక్రమ అమ్మకం.. జగనన్న కాలనీల్లో అక్రమాలు.. నూతన పర్యాటక విధానం తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. 2019- 2024 మధ్య జరిగిన కుంభకోణాలపై శాసన మండలిలో లఘు చర్చ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa