ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలసీమియా బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 12:01 PM

తలసీమియాతో బాధపడుతున్నవారికి నెలకు రూ.25వేల ఆదాయం ఉంటే ప్రభుత్వ సాయం (పెన్షన్‌) వర్తించడం లేదని, రూ.15వేలలోపు ఆదాయం ఉన్నవారికే ఇస్తున్నారని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు జీరో అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నిరంతర చికిత్స, మందుల ఖర్చు ఆ కుటుంబాలకు భారంగా మారిందని, సర్కారు ఆదుకోవాలని కోరారు. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ సమాధానమిస్తూ.. 25వేల ఆదాయం ఉన్న వారు ఆరోగ్యశ్రీ వినియోగించుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పామాయిల్‌ రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారా అని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీకేకే రంగారావు అడగ్గా.. కేంద్రం రూ.17 వేలు ఇస్తుంటే మన రాష్ట్రంలో 20,700 ఇస్తున్నామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయడు బదులిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa