సమాజంలోని ప్రజలంతా బహిరంగ మలవిసర్జనను నియంత్రించి గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. మండలంలోని బాలగొడబ గ్రామంలో ఆయన శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్చాంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి ప్రజలతో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు బహిరంగ మలవిసర్జనకు వెళ్ళనీయకుండా వారి పిల్లలు బాధ్యత పడాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమంపై ఆయన ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
![]() |
![]() |