ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్ చేయలేని వారి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలు ఈక్విటీల్లోకి వస్తున్నాయి. మీరు కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తూ అదనపు పెట్టుబడికి కొత్త ఫండ్ కోసం వేచి చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. దిగ్గజ అసెట్ మెనేజ్మెంట్ కంపెనీ టాటా మ్యూచువల్ ఫండ్ నుంచి న్యూ ఫండ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ కొత్త ఫండ్ ఆఫర్ గురించి తెలుసుకుందాం.
టాటా బీఎస్ఈ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్
టాటా మ్యూచవల్ ఫండ్స్ నుంచి న్యూ ఫండ్ ఆఫర్ వచ్చింది. అదే టాటా బీఎస్ఈ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ మార్చి 17, 2025 రోజున సోమవారం ప్రారంభమవుతోంది. సబ్స్క్రిప్షన్ మార్చి 28, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. అప్పటి వరకు యూనిట్ల కోసం బిడ్లు వేయొచ్చు. గడువు ముగిసిన తర్వాత యూనిట్ల కేటాయింపు ఉంటుంది.
కనీస పెట్టుబడి ఎంత?
టాటా మ్యూచువల్ ఫండ్ నుంచి వస్తోన్న టాటా బీఎస్ఈ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీస పెట్టుబడి రూ. 5 వేలుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. మార్చి 28వ తేదీలోపు బిడ్లు దాఖలు చేయాలి. ఆ తర్వాత ఏప్రిల్ 8, 2025 రోజున యూనిట్ల కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత క్రయ విక్రయాల కోసం యూనిట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. టాటా అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థలో మొత్తం 64 ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జనవరి 31, 2025 నాటికి ఈ కంపెనీ నెట్ అసెట్ వాల్యూ రూ. 1.93 లక్షల కోట్లుగా ఉంది.
మ్యూచువల్ ఫండ్స్లోనూ హైరిస్క్ ఉంటుంది. సరైన ఫండ్స్ ఎంచుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నిపుణుల సలహా మేరకు ఫండ్స్ ఎంచుకుని మంచి పోర్ట్ ఫోలియో నిర్మించుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఈ కథనం కేవలం సమాచారం కోసమే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. న్యూ ఫండ్ ఆఫర్ అనేది ఎలాంటి రిటర్న్స్ ఇస్తాయని అంచనా వేయలేం. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
![]() |
![]() |