ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైష్ణో దేవి ఆలయం వద్ద ఆ పని చేస్తూ దొరికి..చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఓర్రీ

national |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 10:38 PM

బాలీవుడ్ సోషలైట్ మరియు ఇన్‌ఫ్లూయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి చేసిన ఓ తప్పు వల్ల చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా ఇటీవలే జమ్ము కశ్మీర్‌ కాట్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్లిన ఈయన.. అక్కడే తన స్నేహితులతో కలిసి ఓ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అందువల్లే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయనతో పాటు మరో ఏడుగురు స్నేహితులపై కూడా కేసులు పెట్టిన పోలీసులు.. వీరిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి.. ఇటీవలే తన ఏడుగురు స్నేహితులతో కలిసి జమ్ము కశ్మీర్‌లోని వైష్ణో దేవి మాతా ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈక్రమంలోనే అక్కడి ఓ హోటల్లో భోజనం చేసేందుకు ఆగారు. ముఖ్యంగా పక్కనే ఉన్న ఓ హోటల్లో దిగి కడుపు నిండా తినేశారు. అక్కడే తమ వెంట తెచ్చుకున్న ఓ మందు బాటిల్ విప్పి భోజనం చేస్తుండగా తాగేశారు. అయితే విషయం గుర్తించిన కొందరు స్థానికులు దాన్ని ఫొటోలుగా తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అయితే వారిచ్చిన ఫొటోలు చూసిన పోలీసు అధికారులు హోటల్‌కు వెళ్లి మరీ దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే ఓర్రీ అతడి ఏడుగురు స్నేహితులు మద్యం సేవించినట్లు గుర్తించారు. దీంతో వారందరిపై కేసులు నమోదు చేశారు. మార్చి 15వ తేదీన ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి, శ్రీ దర్శన్ సింగ్, శ్రీ పార్థ్ రైనా, శ్రీ రితిక్ సింగ్, శ్రీమతి రాశి దత్తా, శ్రీమతి రక్షిత భోగల్, శ్రీ గుషన్ కోహ్లీ, శ్రీమతి అర్జమస్కినాలపై కేసులు పెట్టారు. ఈ విషయాన్ని నేరుగా అక్కడి పోలీసు అధికారులే వెల్లడించారు.


అయితే వీరు భోజనం చేసిన హోటల్లో నాన్ వెజ్ మరియు ఆల్కహాల్ తాగడానికి అనుమతి లేదు. దివ్య మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర స్థలం కాబట్టి నిషేధం ఉంటుందని పోలీసులు వివరించారు. అలాంటి పవిత్రమైన స్థలంలో ఓర్రీ తన స్నేహితులతో కలిసి చట్ట విరుద్ధంగా మద్యం సేవించారని.. అందుకే వారిపై కేసులు పెట్టామని చెప్పారు. అంతేకాకుండా మత పరమైన ప్రదేశాల్లో భక్తుల మనోభావాలు తెబ్బతీసేలా వ్యవహరిస్తే.. వారు ఎంత పెద్ద వారైనా సరే ఊరుకునేది లేదని అన్నారు. మాదక ద్రవ్యాలు, మద్యం, నాన్ వెజ్ చర్యను సహించబోన్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కాత్రా ఎస్పీ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa