ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణ అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 05:31 PM

నెల రోజుల క్రితం వరకు చలితో ఇబ్బంది పడిన ప్రజలు.. ఇప్పుడు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది వేసవి గట్టిగానే ఉంటుందంటూ సంకేతాలు ఇస్తోంది. ఈ వేసవిలో దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. అయితే ఇది ఏప్రిల్ లోనో మే లోనో ఉంటుందని అందరూ మొదట భావించారు.కానీ మార్చి 18 అంటే బుధవారం రోజునే కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటేసింది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి అటుపక్క రాయలసీమ వరకు చాలా ప్రాంతాల్లో 38 నుంచి 40° లోపే ఉష్ణోగ్రత నమోదు అయిపోయింది. కొన్ని జిల్లాల్లో మాత్రం 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే దీన్ని బట్టి వేసవి ఏ స్థాయి.. ఏ విధంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa