ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండలిలో మాకు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 05:32 PM

శాసనమండలిని, మండలి సభ్యులను చిన్నచూపు చూస్తున్నారంటూ మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న (మంగళవారం) స్పోర్ట్స్ మీట్, ఫొటోసెషన్ సందర్భంగా చైర్మన్ సహా సభ్యులను అవమానించారన్నారు. స్పోర్ట్స్ మీట్ వేదిక, ద్వారాల వద్ద మండలి ఛైర్మన్ ఫొటోలు లేవని.. మండలి ఛైర్మన్‌ను వ్యక్తిగతంగా కించపరుస్తూ, అవమానిస్తున్నారని బొత్స అన్నారు. ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేసి బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫొటో సెషన్‌కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదన్నారు విపక్ష నేత. తనతో పాటు మండలి ఛైర్మన్‌ను కూడా చిన్నచూపు చూశారన్నారు. ఫోటో సెషన్ వద్ద ప్రొటోకాల్ చూస్తోన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వల్ల శాసనమండలికి, సభ్యులకు అగౌరవం వచ్చేలా ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa