బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరవ పరిచారు. తాను వెళ్లిన కార్యక్రమంలో అందరూ జాతీయం గీతాన్ని ఆలపిస్తుండగా.. పక్కవారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నవ్వుతూ, వారిని చేతులతో కొడుతూ జోకులు చేశారు. అయితే ఆసమయంలో పక్క వాళ్లు వద్దని చెబుతున్నా వినకుండా నమస్కారం పెడుతూ.. కెమెరాల వంక చూశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
బిహార్ సీఎం నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరవ పరిచిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా.. అంతా షాక్ అవుతున్నారు. కొందరు ఆయనకు మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. సీఎం నితీష్ కుమార్ తీరుపై మండిపడ్డారు. జాతీయ గీతాన్ని అగౌరవ పరచడంపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి మరీ దీని గురించి రచ్చ చేశారు.
బిహార్ సీఎం నితీష్ కుమార్ నిన్న జాతీయ గీతాన్ని అగౌరవ పరిచారని రాసుకొచ్చి మరీ.. బిహారీగా ఈ విషయంపై తాను సిగ్గు పడుతున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరం అంటూనే.. ముఖ్యమంత్రి వెంటనే పదవీ విరమణ చేయాలని కోరారు. మరోవైపు బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి సైతం దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మానసిక స్థితి సరిగ్గా లేదని.. ఆయన మనసు పని చేయకపోతే తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు.
వీరు మాత్రమే కాకుండా సీఎం నితీష్ కుమార్ ఆరోగ్య, మానసిక పరిస్థితిపై ఆర్జేడీ ఎంపీ మిశా భారతి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజూ ముఖ్యమంత్రి మహిళలు, పిల్లలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నేత చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టడం సరికాదంటూనే.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ ఈ విషయం గురించి ఆలోంచుకోవాలన్నారు. వీలయినంత త్వరగా సీఎ పదవిని వేరే వాళ్లకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa