ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల‌ చిన్నారి హత్య కేసులో బుధవారం అనకాపల్లి జిల్లా చోడ‌వ‌రం కోర్టు సంచలన తీర్పును వెల్ల‌డించింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 01, 2025, 02:23 PM

పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల‌ చిన్నారి హత్య కేసులో బుధవారం అనకాపల్లి జిల్లా చోడ‌వ‌రం కోర్టు సంచలన తీర్పును వెల్ల‌డించింది. ఈ కేసులో నిందితుడు శుభాచారి శేఖర్‌(31)కు న్యాయ‌స్థానం ఉరిశిక్ష విధించింది. దేవరాపల్లికి చెందిన శేఖర్‌కు మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. 2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడం ఇదే మొద‌టిసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com