తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 9 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం స్వామిని 72,981 మంది దర్శించుకోగా.. 21,120 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.09 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa