మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఆయన కుటుంబ వర్గాలు వెల్లడించాయి. గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని.. హార్ట్ సర్జరీ కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్కు తరలించిన విషయం తెలిసిందే. కాగా.. కొడాలి నానికి ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రముఖ కార్డియాక్ సాధ్యం డాక్టర్ పాండ వైద్య బృందం సుమారు 10 గంటల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతం అయింది. కాగా.. ప్రస్తుతం కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మరో మూడు రోజులపాటు కొడాలి నాని డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండనున్నట్టు సమాచారం.
మార్చి 26వ తేదీన కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురికాగా.. ఆయనను హుటాహుటిన హైదరాబాద్లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. సుమారు ఐదు రోజుల పాటు ఏఐజీలో చికిత్స తీసుకున్న కొడాలి నానికి.. మొదట గ్యాస్టిక్ సమస్య అని చెప్పగా.. ఆ తర్వాత పలు పరీక్షల అనంతరం గుండెకు సంబంధించిన సమస్య ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. కొడాలి నానికి 3 రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
మొత్తం 3 వాల్స్ బ్లాక్ అవ్వడంతో క్రిటికల్ హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేయటం కానీ బైపాస్ సర్జరీ కానీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. కొంతకాలం సర్జరీ చేయటం మంచిది కాదని వైద్యులు సూచించినట్టు సమాచారం. దీంతో.. మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే.. ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. అక్కడి వైద్యులు 10 గంటల పాటు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైనట్టు సమాచారం.
అయితే.. 2024లో జరిగిన ఏపీ ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు చాలా యాక్టీవ్గా ఉన్న నాని.. ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిత్యం మీడియాలో కనిపిస్తూ.. తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడే కొడాలి నాని.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన అనారోగ్యానికి గురికావటంతో.. ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కాస్త ఆందోళనకు గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa