ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత.. పాట్నా నుంచి ఢిల్లీకి

national |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 08:27 PM

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ -ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు పాట్నాలోని తన నివాసంలోనే డాక్టర్లు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే మరింత మెరుగైన వైద్యం కోసం.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఆయన డాక్టర్లు సలహా ఇచ్చారు. షుగర్ లెవల్స్ పెరిగిపోవడంతో ఆయనకు తగిలిన పాత గాయం మరింత ఇబ్బంది పెడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇవాళ ఉదయం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. రబ్రీ దేవి నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న లాలూను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.


పశువుల దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్.. అనారోగ్యం కారణంగా జార్ఖండ్‌ రాంచీలోని రిమ్స్‌లో చేరారు. చాలా రోజుల పాటు అక్కడే చికిత్స తీసుకుని.. డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో చీఫ్ డాక్టర్ విద్యాపాటి.. ఢిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించాలని సూచించారు. 2024లో కూడా అనారోగ్యం పాలు కాగా.. అప్పటినుంచి తరచూ ఆయన అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్‌కి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa