ముంబయిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన సిద్ధి వినాయక ఆలయ వార్షిక ఆదాయం రూ.133 కోట్లకు చేరుకుని రికార్డు సాధించింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఆదాయం లభించలేదు. ఇదే తొలిసారి కావడంతో సిద్ధి వియనాక ఆలయ నిర్వాహకులు ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ముంబయిలోని ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టిన ఆడ పిల్లల కోసం ఎఫ్డీ పథకాన్ని తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కో బాలికకు రూ.10 వేలు ఇస్తూ.. ఆ డబ్బును వారి తల్లుల ఖాతాల్లో ఫిక్డ్స్ డిపాజిట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ముంబయి సిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.133 కోట్ల వార్షిక ఆదాయన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.114 కోట్లు మాత్రమే రాగా.. ఈసారి 14 శాతం పెరిగిందని కార్యనిర్వాహక అధికారి వీణా పాటిల్ తెలిపారు. అయితే ట్రస్ట్ ఛైర్మన్ సదానంద్ సర్వాంకర్ నేతృత్వంలోని మేనేజింగ్ కమిటీ.. మార్చి 31వ తేదీన ఆలయ వార్షిక బడ్జెట్ను సమర్పించింది. ఆలయంలో మరియు ఆన్లైన్ ద్వారా వచ్చిన విరాళాలు, పూజా ఆచారాలు, ప్రసదాల అమ్మకం ద్వారా దీన్ని అంచనా వేస్తారు. అయితే ఇలా వచ్చిన డబ్బును ట్రస్ట్ సంక్షేమ కార్యకలపాలాకు మళ్లిస్తుంటారు.
అయితే ఆలయంలో క్యూ లైన్లను వేగంగా ముందుకు పంపించడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం లభించిందని సిద్ధి వినాయక ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సందీప్ రాథోడ్ తెలిపారు. దీని వల్లే ఎక్కువ మొత్తంలో భక్తులు స్వామి వారిని సందర్శించుకుని... కానుకలు సమర్పించారన్నారు. ఇదే పద్ధతిని పాటిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆలయ ఆదాయాన్ని రూ.154 కోట్లకు పెంచుతామన్నారు. అయితే ఈసారి ఎక్కువ మొత్తంలో ఆదాయం లభించగా.. దాన్ని ఆడపిల్లల సంక్షేం కోసం వినియోగిస్తామని చెప్పారు.
ముఖ్యంగా సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్.. భాగ్య లక్ష్మీ పథకాన్ని రూపొందించిందని రాథోడ్ తెలిపారు. దీని ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని చెప్పారు. ఈ ప్రతిపాదన ప్రకారం మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ప్రతీ అమ్మాయికి ట్రస్ట్ రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందన్నారు. అయితే ఈ డబ్బులను ఆడ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఆలయ ట్రస్టులు ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి అని.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో బేటీ పడావో నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa