ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్లో ఆశించిన మేర రాణించలేకపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్.. కేకేఆర్తో మ్యాచ్లోనూ పట్టు విడిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. ఓ దశలో 16 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ పంపి.. కేకేఆర్పై ఒత్తిడి పెంచింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పట్టుకోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కేకేఆర్ బ్యాటర్లు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. 200 పరుగుల మార్కును చేరుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు.. రెండో ఓవర్లోనే క్వింటన్ డికాక్ (1), మూడో ఓవర్లోనే సునీల్ నరైన్ (7) వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టు స్కోరు బోర్డు నెమ్మదించింది. ఈ దశలో కెప్టెన్ అజింక్య రహానే (27 బంతుల్లో 38 రన్స్), రఘువంశీ (32 బంతుల్లో 50 రన్స్) జట్టును ఆదుకున్నారు. మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. ఈ సీజన్లో తొలిసారి సత్తాచాటాడు.
29 బంతుల్లో 60 రన్స్ చేసి.. జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు అయ్యర్. రింకూ సింగ్ (17 బంతుల్లో 32 రన్స్) బ్యాట్ ఝుళిపించడంతో కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 200/6 పరుగులు చేసింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కామిండు మెండిస్ ఒక్కో వికెట్ తీశారు.
కాగా ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్లో సన్ రైజర్స్.. రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగినా.. ప్రతికూల ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్లో గెలిచి తిరిగి ఫామ్ అందుకోవాలని సన్రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa