పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు పూర్తయిన పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందులో భాగంగా రూ. 28.5 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారితో కలసి ప్రారంభించారు. అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో రూ. 65.24 లక్షలతో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పంప్ హౌస్ లో మోటార్ల పని తీరుని పరిశీలించారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ని ప్రారంభించారు. క్యాంటిన్ లో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. శ్రీ నాగబాబు గారితోపాటు ఏపీ టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగిలి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు గారు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, అధికారులు పాల్గొన్నారు.
![]() |
![]() |