నగరంలో మిస్సింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా నగరంలో పలువురు కనిపించకుండా పోయారు. తాజాగా.. ఓ కుటుంబం మెుత్తం కనిపించుకుండా పోవటం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో మహేష్ ఉమా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రిషి, చైతు, శివన్ ముగ్గురు పిల్లలు. మహేష్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా పని చేస్తున్నారు. అయితే వీరి ఇంటికి సమీప బంధువు సంధ్య అనే మహిళ గురువారం (ఏప్రిల్ 2) ఉదయం వెళ్లింది. ఆ తర్వాత మహేష్, ఉమా దంపతుు, వారి ముగ్గురు పిల్లలు, సంధ్య కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇంటి ఓనర్కు కూడా చెప్పకుండా వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో ఇంటి ఓనర్ మహేష్ సోదరుడు బిక్షపతికి విషయం చెప్పాడు. బిక్షపతి తన అన్న మహేష్, వదిన ఉమా ఫోన్లకు ఫోన్ చేసినా స్పందన లేదు.
దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా విచారణ ముమ్మరం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ ఆరుగురు కుటుంబ సభ్యులు ఆటో బుక్ చేసుకొని బోయిన్పల్లి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టేషన్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి నుంచి ఎటు వెళ్లారనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఎదైనా పుణ్యక్షేత్రానికి దైవ దర్శనానికి వెళ్లారా..? లేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా..? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగానే విచారణను ముమ్మరం చేశారు. త్వరలోనే వారి ఆచూకీ కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa