ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 10 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 08:35 PM

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ 10 నుంచి నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారిని దర్శించుకుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల.. వసంతోత్సవాల్లో భాగంగా విద్యుద్దీప అలంకరణతో శోభాయమానంగా విరాజిల్లనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa