ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 07:42 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ వచ్చింది. సింగపూర్‌లో ఓ సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులలోకి పొగ చేరింది. దీంతో మార్క్ శంకర్‌ను ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు కూడా ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. మార్క్ శంకర్‌ను ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ.. పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌ చేరుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది.


పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి మార్క్ శంకర్‌కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తుండగా.. ప్రస్తుతం బయటకు తీసుకువచ్చినట్లు తెలిపింది. అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులలోకి పొగచేరింది. మార్క్ శంకర్‌కు మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని.. అలాగే వైద్యుల పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు పవన్ కళ్యాణ్ కుటుంబానికి తెలియజేసినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ తెలిపింది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు తీసుకువచ్చారని.. మరిన్ని పరీక్షలు చేయడంతో పాటుగా మూడురోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్లు తెలిపింది.


మరోవైపు మార్క్ శంకర్ ప్రమాదం గురించి పవన్ కళ్యాణ్‌కు అరకు పర్యటనలో ఉన్న సమయంలో తెలిసింది. మంగళవారం ఉదయం దీని గురించి పవన్ కళ్యాణ్‌కు సమాచారం అందింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం విశాఖ పర్యటనను రద్దు చేసుకుని మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు.


హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. మంగళవారం ఉదయం తనకు ప్రమాద తీవ్రత తెలియలేదని అన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి కూడా చనిపోయిందని చెప్పారు. తన పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టినరోజు నాడే చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడటం బాధాకరమంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం ఆయన సింగపూర్ బయల్దేరి వెళ్లారు. సోదరుడు చిరంజీవి, వదిన సురేఖతో పాటుగా పవన్ కళ్యాణ్ సింగపూర్ చేరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa