రాష్ట్రంలో కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీ అధినేత, జగన్ భద్రతపై ప్రజల్లో ఆందోళన కొనసాగుతోందన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఎక్కడికి వెళ్లిన అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారన్నారు. కూటమి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.భద్రత విషయంలో కేంద్ర హోమంత్రి అమిత్షాను కలుస్తాం. వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవు. రామగిరిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. మాజీ సీఎం జగన్కు భద్రత చర్యలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రజా స్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్, ఆ సంగతి అధికారులకు తెలుసు. వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత ఆక్రోశం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa