ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషం కలిగిస్తోందని వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 07:14 PM

నారా లోకేశ్ నేడు మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మంగళగిరి డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాటు చేసిన 'మన ఇల్లు-మన లోకేశ్' కార్యక్రమంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తూ సంతోషంతో పొంగిపోయారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తనకు ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. తొలి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తనకు, మంగళగిరి ప్రజలు రెండోసారి చిరస్మరణీయ విజయం అందించారని, వారి కోసం శక్తిమేర కృషి చేస్తానని స్పష్టం చేశారు. 2019 నుంచి 2024 వరకు నన్ను అనేక రకాలుగా అవమానించారు. మంగళగిరిలో గెలవలేదని హేళన చేశారు. సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయారని చంద్రబాబు గారిని అన్నారు. ఆ సమయంలో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను దానిపక్కన సున్నా పెట్టి 53,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆనాడు మంగళగిరి ప్రజలను కోరాను. అందరికీ దిమ్మతిరిగి విధంగా 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించారు. ఈ రోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేస్తున్నానంటే దానికి కారణం మీరు ఇచ్చిన మెజార్టీ అని ఉద్వేగభరితంగా చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa