కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80సీ ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే వడ్డీ, మెచ్యూరిటీ అమౌంట్ కి సైతం ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు ఉంటుంది. పదవీ విరమణ, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి కోసం ఈ పథకం సరైన ఎంపికగా చెబుతుంటారు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు ఉంటుంది. సురక్షిత పెట్టుబడి పథకాలతో కోటీశ్వరులు కావాలనుకుంటే పీపీఎఫ్ బెస్ట్ ఆఫ్షన్. మరి ఇందులో రూ. 1 కోటి రాబడి పొందేందుకు ఏం చేయాలి? పథకం గడువు పొడిగిస్తే మంచిదేనా? అనే విషయాలు తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఇందులో ఏడాదికి కనీసం రూ. 500 నుంచి రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత మరో 5 సంవత్సరాలు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు. ఆ సమయంలోనూ డిపాజిట్ చేయడం కొనసాగించవచ్చు. లేదా ఎలాంటి పెట్టుబడి చేయకుండానే కొనసాగించొచ్చు. ఈ సమయంలో 60 శాతం ఫండ్స్ విత్ డ్రా చేసుకోవచ్చు కూడా. పీపీఎఫ్ ఖాతాదారులు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు డిపాజిట్ చేస్తే ఆ డబ్బులకు సైతం అదే నెల వడ్డీ రేటు లభిస్తుంది. అంటే డబుల్ బెనిఫిట్ పొందవచ్చు.
పీపీఎఫ్ ఖాతాలో గరిష్ఠ పరిమితి ఏడాదికి రూ.1.50 లక్షలు జమ చేయవచ్చు. అలా మీరు ఏడాదికి రూ. 1.50 లక్షలు 15 సంవత్సరాల పాటు జమ చేస్తే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.40.68 లక్షలు వస్తాయి. మీ పెట్టుబడి రూ.22.5 లక్షలు, వడ్డీ రూ. 18.18 లక్షలు అందుతాయి. ఒక వేళ మీరు మరో 5 ఏళ్లు పొడిగించి ఏడాదికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడుతూ వెళ్తే అప్పుడు 20 ఏళ్ల తర్వాత చేతికి రూ. 67 లక్షలు వస్తాయి. మరో 5 సంవత్సరాలు అంటే 25 ఏళ్ల వరకు పెట్టుబడి కొనసాగించినట్లయితే చేతికి రూ. 1.03 కోట్లు అందుతాయి. మరోవైపు.. 15 ఏళ్ల తర్వాత మీరు మరో 5 సంవత్సరాలు పథకం పొడిగించినా ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే కొనసాగవచ్చు. అలా చేస్తే మీ చేతికి రూ. 57.32 లక్షలు వస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa