ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతంలో డ్రోన్‌ కెమెరా కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 08:50 PM

 శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో డ్రోన్‌ కెమెరా కలకలం రేపింది. దీంతో భక్తులు, తక్షణమే స్పందించిన విజిలెన్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  మహారాష్ట్రకు చెందిన భక్తుడు దాదాపుగా 10 నిమిషాలు డ్రోన్‌ కెమెరా వినియోగించినట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.భద్రతా దృష్ట్యా తిరుమలలో డ్రోన్లు ఎగురవేసేందుకు అనుమతి లేదు. కొండపైకి వచ్చే వాహనాలను అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద క్షుణ్ణంగా పరిశీలించాకే తిరుమలకు వెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ అధికారుల కళ్లుగప్పి డ్రోన్‌ కెమెరాను తీసుకురావడమే కాకుండా వీడియోలు తీయడం కలకలం రేపింది. గతంలోనూ శ్రీవారి ఆలయంపై అగంతకులు డ్రోన్‌ ఎగరేసిన ఘటనలు చాలా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa