దేశ రాచరిక వారసత్వ సంపద గోల్కొండ బ్లూ డైమండ్ త్వరలో వేలం వేయనున్నారు. ఇండోర్, బరోడా మహారాజుల కాలం నాటి ఈ అరుదైన వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్లో వేలం వేస్తుంది. 23.24 క్యారెట్ల ఈ వజ్రం ధర దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ. 430 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వజ్రానికి 259 సంవత్సరాల చరిత్ర ఉందని.. ఈ వజ్రం ప్రపంచంలోనే చాలా అరుదైనదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా చెబుతున్నారు. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ప్రత్యేకతను సంపాదించింది. ఇది మొదట ఇండోర్ రాజవంశం యొక్క గొప్పదనానికి చిహ్నంగా ఉండేదని చెబుతున్నారు. రూ.6.7 కోట్ల విలువ చేసే డైమండ్ కమ్మలు మింగేశాడు.
పూర్వం ఇండోర్ను పాలించిన మహారాజా యశ్వంత్ రావు హోల్కర్-ll దగ్గర ఒక వజ్రం ఉండేది. ఈ 'ది గోల్కొండ బ్లూ'ను 1923లో మహారాజా తండ్రి బ్రాస్లెట్లో పెట్టించారు. ఆ తర్వాత ఆభరణాలను మళ్లీ డిజైన్ చేసిన సమయంలో ఈ వజ్రాన్ని ఇండోర్ పియర్ వజ్రాలతో చేసిన నెక్లెస్లో అమర్చారు. 1947లో న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ దీనిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇది బరోడా మహారాజుకు చేరగా.. చివరగా ఒక ప్రైవేటు సంస్థ దీనిని సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌటెట్ డి మోన్వెల్ ఒకప్పటి ఇండోర్ మహారాణి చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రంలో రాణి ధరించిన ఆభరణాలలో ఈ వజ్రం కూడా ఉంది. అత్యంత అరుదైన ఈ వజ్రం వేలానికి వస్తుండటం ఆసక్తికరంగా మారింది.. ఈ డైమండ్ను దక్కించుకునేందుకు పలు సంస్థలు, ప్రముఖులు పోటీపడే అవకాశం ఉందంటున్నారు. అభిమానికి బూట్లు వేసిన ప్రధాని మోదీ
అయితే వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన నీలి వజ్రం కూడా ఉందని చెబుతున్నారు. ఒపెన్హైమర్ బ్లూ అనే 14.62 క్యారెట్ల డైమండ్ 2016 మేలో క్రిస్టీస్ జెనీవా వేలంలో 57.5 మిలియన్ డాలర్లకు పైగా ధర పలికిందట. ఈ వజ్రం మూలాలు ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలోని ప్రఖ్యాత గోల్కొండ గనులతో ముడిపడి ఉన్నాయంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa