ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలనను గాలికొదిలేసి విలాసాల కోసం విదేశాల్లో తిరుగుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 10:59 AM

కూటమి పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, గత కొన్నాళ్లుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అయినా వారిని ఆదుకునే దిక్కు లేకుండా పోయిందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. అకాల వర్షాల వల్ల అరటి తోటలు పడిపోయి, మామిడి పూత, పిందెలు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. మరోవైపు మిర్చి, ధాన్యం, పొగాకు పంటలకు మద్ధతు ధరలు దక్కడం లేదని, మిర్చి రైతులు రోడ్డు మీదనే తమ పంటను తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం తన పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబంతో కలిసి యూరప్‌ టూర్‌కి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్‌ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. వీళ్లంతా పాలనను గాలికొదిలేసి ప్రతి వీకెండ్‌ కి విలాసాల కోసం ప్రత్యేక విమానాల్లో వెళ్లి జల్సా చేస్తున్నారు. ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa