ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్‌ ఛార్జీల రూపంలో ప్రజలపై వేలకోట్లు భారం మోపారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 11:06 AM

రాష్ట్రంలో విద్యుత్‌ రంగానికి ఇప్పుడు చీకటి రోజులు అని, చంద్రబాబు హయాంలో ఎప్పుడూ వెలుగులు అనేవి ఉండవని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ తేల్చి చెప్పారు. చంద్రబాబు పేరు వినగానే ఎవరికైనా గుర్రాలతో తొక్కించడం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయని ఆయన తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని, ట్రూఅప్‌ ఛార్జీలు కూడా రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు, ఇప్పటికే ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్లకు పైగా భారం మోపారని ఆక్షేపించారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీలు 50 శాతం పెరిగాయని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ డిస్కమ్‌లు నష్టాలబారిన పడతాయని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa