జగన్ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత పెంచింది. కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి (రాజ్ కసిరెడ్డి) కోసం విస్తృతంగా గాలిస్తూనే.. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. శుక్రవారం (18న) విచారణకు రావాలంటూ వారిద్దరికీ మూడ్రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. అయితే ఒక రోజు ముందే.. గురువారమే వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి కోసం సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులు విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం వరకూ ఎదురు చూశారు. చివరి నిమిషంలో ఆయన నుంచి ఓ సందేశం వచ్చింది. ఇతరత్రా ముఖ్యమైన పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నానని, శుక్రవారం తప్పకుండా హాజరవుతానన్నది దాని సారాంశం. ఇంకోవైపు.. శుక్రవారం రావలసిన మిథున్రెడ్డి సిట్ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణను ఆడియో-వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. ఇందుకు కోర్టు నిరాకరించడంతో ఆయన సిట్ ముందు హాజరవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో శనివారం (19న) విచారణకు రావాలని సిట్ అధికారులు ఆయనకు మరో నోటీసిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa