ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత అనుభవంతో ,,,,అలేఖ్య చిట్టి సిస్టర్స్ కొత్త వ్యాపారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 07:39 PM

అలేఖ్య చిట్టి పికిల్స్.. కొన్ని రోజుల కిందట ఈ ఊరగాయల వివాదం సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్.. చివరకు అదే సోషల్ మీడియా కారణంగా దుకాణం బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలేఖ్య చిట్టి పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ఓ కస్టమర్ అడిగితే.. అలేఖ్య మాట్లాడిన బూతు మాటలు నెట్టింట వైరల్ కాగా.. ఆ తర్వాత అక్కా చెల్లెళ్లు క్షమాపణలు కూడా చెప్పారు. వీరిపై ట్రోల్స్, మీమ్స్ ఏ రేంజులో వచ్చాయంటే అలేఖ్య చివరకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం అలేఖ్య చిట్టి ఊరగాయల వివాదం సద్దుమణిగింది. దీంతో నెక్ట్స్ ఏంటి అనే దానిపై ఈ సిస్టర్స్ దృష్టి పెట్టారు.


ఈ క్రమంలోనే అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య కంచర్ల ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తాము నెక్ట్స్ ఏంచేయాలో అనుకుంటున్నామో, ఆ బిజినెస్ పేరేంటో కూడా చెప్పేశారు రమ్య కంచర్ల. 11 నెలల పాటు తమ అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా నడిచిందని చెప్పుకొచ్చారు. అయితే అలేఖ్య మాటలతో ఏర్పడిన వివాదం వలన 11 నెలలకే తాము బిజినెస్ మూసేస్తామని అనుకోలేదని వాపోయింది. అలేఖ్య చిట్టి పికెల్స్ వ్యాపారాన్ని మూసివేశామని చెప్పారు. అయితే కస్టమర్లు, శ్రేయోభిలాషులు, బంధువులు.. మళ్లీ గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారని రమ్య కంచర్ల తెలిపారు.


అందుకే మళ్లీ బిజినెస్‌లో కమ్‌బ్యా్క్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు రమ్య కంచర్ల తెలిపారు. అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం నేపథ్యంలో మునుపటిలా తమకు మద్దతు ఉంటుందా.. ఆదరిస్తారా అనేది అనుమానంగా ఉందన్నారు. అయితే ఏదేమైనా ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని.. అందుకే రమ్య మోక్ష పికిల్స్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు రమ్య కంచర్ల క్లారిటీ ఇచ్చారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కస్టమర్లతో మాట్లాడేందుకు ఓ వ్యక్తిని కూడా నియమించుకుందామని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కొత్త వ్యాపారంలో అక్క అలేఖ్యను భాగస్వామ్యం చేయబోమని రమ్య కంచర్ల చెప్పారు. మొత్తం తానే చూసుకుంటానని చెప్పారు.


వాస్తవానికి అలేఖ్య చిట్టి పికిల్స్‌కు రమ్య మోక్ష పికిల్స్ అని పెట్టాలని ఫస్ట్ అనుకున్నామని.. కానీ అప్పుడు తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండటంతో అలేఖ్య పేరు పెట్టినట్లు చెప్పారు. ఊరగాయల వ్యాపారం అంటే ఇండస్ట్రీలో మరోలా అనుకుంటారని తన అక్క పేరు పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే రమ్య మోక్ష పికిల్స్ వ్యాపారంతో మీ ముందుకు వస్తామని.. అందుకు మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందన్నారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా తమను ఆదరించాలంటూ రమ్య కంచర్ల కొత్త వ్యాపారం గురించి కొత్త కబుర్లు చెప్పుకొచ్చారు. మరి కొత్త వ్యాపారం ఎప్పుడు మొదలెడతారో చూడాలి మరి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa