ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమిలిపై నేడు పార్లమెంటరీ కమిటీ సమావేశం

national |  Suryaa Desk  | Published : Tue, Apr 22, 2025, 11:56 AM

జమిలి ఎన్నికలపై మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగనుంది. అనంతరం భారత్‌లోని అన్ని బాషాల్లో క్యూఆర్ కోడ్ సౌకర్యంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్‌సైట్ అందుబాటులోకి రానుంది. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, డా. జస్టిస్ బి.ఎస్. చౌహన్, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్.ఝా తదితరులు పాల్గొననున్నారు.కాగా.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 4న ముగియనున్నాయి. ఈ సమావేశాల చివరి వారం మొదటి రోజు పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉండగా.. ఆ గడువును లోక్ సభ పొడిగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.బీజేపీ ఎంపీ పీపీ చౌధరి నేతృత్వంలోని ఈ ప్యానెల్  తన పనిని ముగించేందుకు మరి కొంత సమయం అవసరమని, ఈ నేపథ్యంలో ప్యానెల్  గడువును పొడిగించవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కమిటీలో ప్రస్తుతం 38మంది సభ్యులతో పాటు ఇద్దరు స్పెషల్  ఆహ్వానితులు కూడా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa