జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఉగ్రదాడి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ సంతాపం తెలిపారు. ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సంతాప దినాలను పవన్కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లు పవన్కల్యాణ్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఈ దుశ్చర్యను ఖండించి, మృతులకు సంతాపం తెలిపామనిఅన్నారు. జనసేన పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం అన్ని జనసేన పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకూ దించి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఏపీ వ్యాప్తంగా మానవ హారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని నేతలకు పవన్కల్యాణ్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa