ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. నిన్న పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.ఈ నిర్ణయంలో భాగంగా, నేటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల ఆటగాళ్లతో పాటు ఫీల్డ్ అంపైర్లు కూడా నల్ల బ్యాడ్జ్లు ధరించి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. అంతేకాకుండా, మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలోని ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకులతో సహా అందరూ ఒక నిమిషం పాటు మౌనం పాటించి మృతులకు నివాళులు అర్పించనున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, నేటి మ్యాచ్లో ఛీర్లీడర్స్ను అనుమతించడం లేదని ఐపీఎల్ వర్గాలు స్పష్టం చేశాయి.2019 పుల్వామా దాడి అనంతరం జరిగిన 12వ ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ఆ వేడుకలకు కేటాయించిన నిధులను ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాల సంక్షేమానికి విరాళంగా అందించింది.పహల్గాం ఉగ్రదాడిని పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య వంటి క్రీడాకారులు సోషల్ మీడియా ద్వారా బాధితులకు తమ మద్దతును, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ ఘటనపై సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా స్పందించింది. ‘‘పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ ఒక ప్రకటనలో పేర్కొంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa