ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం ఉగ్రదాడికి కారణం అదే.. పాకిస్థాన్ రక్షణ మంత్రి సంచలనం

international |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 11:19 PM

జమ్ము కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం లోయలో మంగళవారం రోజు ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ ఘటనలో 28 మంది చనిపోగా.. మరెంతో మంది గాయప్డడారు. మరోవైపు భారత బలగాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈక్రమంలోనే వారి హిస్టరీ కూడా బయటకు లాగి ఇద్దరు టెర్రరిస్టులు పాకిస్థాన్‌కు చెందిన వాళ్లుగా గుర్తించింది. అయితే తాజాగా ఈ ఘటనపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి స్పందించారు. తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అంతటితో ఆగకుండా ఇండియాలో ప్రధాని మోదీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈక్రమంలోనే నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకు నిత్యం దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ దాడుల్లో భాగంగానే ఇది కూడా జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


జమ్ము కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో మంగళ వారం రోజు ఉగ్రదాడి జరిగింది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పర్యటకులపై కాల్పులకు తెగబడ్డారు. ఆడా, మగా అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కాల్చారు. ఈ ఘటనలో ఇప్పటికే 28 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరందరినీ ఆస్పత్రులకు తరలించిన భారత బలగాలు.. ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కాల్పులు చేసిన తర్వాత ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి వెళ్లినట్లు తెలుస్తుండగా.. గాలింపు చర్యలు చేపట్టారు.


మరోవైపు ఓ నలుగురు ఉగ్రవాదులు ఇంకా బైసరన్ ప్రాంతంలోనే నక్కినట్లు గుర్తించిన అధికారులు వారి హిస్టరీలను కూడా బయటకు తీశారు. ఈక్రమంలోనే అందులో ఇద్దరు టెర్రరిస్టులు పాకిస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. మిగతా వారి కోసం కూడా వెతుకులాట సాగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ఘటనపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. పహల్గాం ఉగ్రదాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా భారత దేశంలోని ప్రధాని మోదీ సర్కారుకు నాగాలాండ్ నుంచి కశ్మీర్ వరకు తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు.


మణిపూర్, నాగాలాండ్, కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ అల్లర్లు జరుగుతున్నాయని పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బీజేపీ సర్కారు ప్రజలను వేధించడం వల్లే వారంతా ఇలా చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము అస్సలే ఉగ్రవాదాన్ని సపోర్టు చేయబోమని చెప్పారు. ఒకవేళ స్థానిక బలగాలు భారత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే.. అప్పుడు పాకిస్థాన్ పేరును వాడుకోవడం సులువు అవుతుందని ఇలా చేసుండొచ్చంటూ వెల్లడించారు. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు, ముఖ్యంగా భారత సర్కారుపైనే నిందలు మోపడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని చెప్పుకొస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa