నటసింహం నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2025 ఏడాదికి సంబంధించి కేంద్రం మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి అవార్డులను అందజేయగా నందమూరి బాలకృష్ణ పంచెకట్టులో హాజరై అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరో నందమూరి బాలకృష్ణకి కేంద్రం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మభూషణ్' పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కళారంగంలో, సామాజిక సేవలకు గాను బాలకృష్ణకు పద్మభూషణ్ పుసరస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో వెండితెరపై విభిన్న పాత్రలు పోషించాడు బాలకృష్ణ. ఆయన సినీ కెరీర్లో, 110 చిత్రాలలో, ఆయన తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులతో పాటుగా, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, కూతురు తేజస్విని ఆయన భార్య వసుందర పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa