ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మరో రెండు హామీల అమలుకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డీఎస్సీ వంటి హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేసింది. తాజాగా మే నెల నుంచి మరో రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రకటించారు.
మే రెండో తేదీన రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం జరగనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బూత్ స్థాయి నేతలతో చంద్రబాబు బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మే నెల నుంచి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ప్రారంభించనున్నట్లు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
అన్నదాత సుఖీభవ పథకం విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి దీనిని అమలు చేస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామి ఇచ్చింది. అందులో భాగంగా పీఎం కిసాన్ యోజనతో కలిపి మూడు విడతలుగా ఈ రూ.20 వేలు సాయం అందించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.6000, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.14000 ఉండనుంది. మూడు విడతల్లో ఈ సాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
మరోవైపు తల్లికి వందనం పథకం కింద పిల్లలను పాఠశాలలకు పంపిస్తే ఏటా రూ.15000 అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది స్కూలుకు వెళ్లే విద్యార్థులు ఉంటే అందరికీ ఏటా రూ.15000 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మే నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa