కేంద్ర ప్రభుత్వం కులగణనపై బుధవారం తీసుకున్న కీలక నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలికింది. కేంద్రం చేపట్టనున్న కులగణన ప్రక్రియకు తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధ భారత్ గాంధీ ప్రకటించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కులగణనకు స్పష్టమైన సమయపాలనను నిర్దేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణనను ఒక బ్లూప్రింట్గా పేర్కొంటూ, ఇది దేశవ్యాప్తంగా మోడల్గా నిలుస్తుందని అన్నారు. "తెలంగాణలో కులగణన విజయవంతంగా జరిగింది. ఇది దేశానికి ఒక ఆదర్శంగా ఉపయోగపడుతుంది," అని ఆయన వ్యాఖ్యానించారు.
కులగణన అనేది సామాజిక న్యాయానికి తొలి మెట్టు మాత్రమేనని, ఈ ప్రక్రియలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండాలని రాహుల్ పిలుపునిచ్చారు. "ఇది కేవలం లెక్కలు తీసే ప్రక్రియ కాదు, సమాజంలో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం, న్యాయం అందించేందుకు ఇది ఒక అవకాశం," అని ఆయన అన్నారు.
కేంద్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కులగణన పారదర్శకంగా, సమగ్రంగా జరిగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ ప్రక్రియ ద్వారా సామాజిక, ఆర్థిక డేటా సేకరణ జరిగి, వెనుకబడిన వర్గాల ఉన్నతికి దోహదపడుతుందని పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa