ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గామ్ దాడి ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్ అడవుల్లోనే నక్కి ఉన్నారని ఎన్ఐఏ అనుమానం

national |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 06:06 PM

పహల్గామ్‌లో పర్యాటకులపై ఇటీవల జరిగిన మారణహోమానికి బాధ్యులైన ఉగ్రవాదులు ఇంకా పట్టుబడలేదని, వారు సమీపంలోని దక్షిణ కశ్మీర్ అటవీ ప్రాంతంలోనే తలదాచుకొని ఉండవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ  వర్గాలు కీలక సమాచారం వెల్లడించాయి. ఈ దాడి వెనుక మరికొందరు ఉగ్రవాదుల ప్రమేయం కూడా ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం వారి కోసం భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి.ఏప్రిల్ 22న బైసరన్ మైదానంలో దాడి జరుగుతున్న సమయంలో, ప్రధాన బృందానికి రక్షణగా మరికొందరు ఉగ్రవాదులు కొంత దూరంలో మాటు వేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగితే, వారికి అండగా నిలిచేందుకు వీరు సిద్ధపడినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఉగ్రవాద ముఠా ఎవరిపైనా ఆధారపడకుండా, తమకు కావాల్సిన ఆహారం, ఇతర నిత్యావసరాలను వెంట తెచ్చుకున్నారని, ఈ కారణంగా పర్వత ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో బయటి సహాయం లేకుండా ఎక్కువ కాలం మనుగడ సాగించగలరని అధికారులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa