ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి

business |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 07:55 PM

ఇటీవలి కాలంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా గురువారం ఒక్కరోజే పసిడి ధరల్లో భారీ పతనం నమోదైంది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఏకంగా రూ.2,180 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.95,730 వద్ద కొనసాగుతోంది. గత పది రోజుల వ్యవధిలో చూసుకుంటే, బంగారం ధర దాదాపు రూ.5,000 వరకు దిగిరావడం గమనార్హం.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలే దేశీయంగా ధరల తగ్గుదలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,236.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు సంకేతాలు వెలువడటం వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపాయని వారు పేర్కొంటున్నారు. దీనికి తోడు డాలర్ విలువ బలపడటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి గిరాకీ తగ్గిందని, ఫలితంగా వరుసగా రెండో రోజు ధరలు తగ్గాయని వివరిస్తున్నారు. త్వరలో వెలువడనున్న అమెరికా ఆర్థిక గణాంకాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇదిలా ఉండగా, ఇటీవల ముగిసిన అక్షయ తృతీయ సందర్భంగా దేశీయంగా బంగారానికి విశేషమైన గిరాకీ లభించింది. ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, పవిత్రమైన రోజున పసిడి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపించారు. అక్షయ తృతీయ నాడు సుమారు 12 టన్నుల బంగారం విలువ రూ.12,000 కోట్లు, రూ.4,000 కోట్ల విలువైన వెండి అమ్ముడయ్యాయని, మొత్తం విక్రయాలు రూ.16,000 కోట్లకు చేరి ఉండవచ్చని ఆలిండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ అరోరా వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa